ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 

విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ఎమ్మెల్యే బాలు నాయక్ 

ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 

జయభేరి, దేవరకొండ :
పిఏ పల్లి మండల పరిధిలోని మోడల్ స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించిన దేవరకొండ ఎమ్మెల్యే  నేనావత్ బాలు నాయక్. పిఎ పల్లి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్‌కు గురికాలేదని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. 

విద్యార్థులకు కడుపునొప్పి రావడంతో అస్వస్థతకు గురికాగా నిన్న రాత్రి దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు అని అన్నారు. వైద్యు అధికారులు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారని అన్నారు. గత మూడు రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవడంతో విద్యార్థులు  డీహైడ్రేషన్‌కు గురయ్యారు అని అన్నారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు అని అన్నారు. అనంతరం వైద్యం పొందుతున్న రోగులను పరామర్శించి వైద్య సేవలు అడిగి తెలుసుకోవడం జరిగింది.

Read More అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా

గురుకుల హాస్టల్లోన్ని తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొని పాఠశాలలోని,మౌలిక సదుపాయాలు, చెత్త, మరుగుదొడ్ల, నిర్వహణ, సీజనల్ జ్వరాల దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలఫై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్. నాణ్యతమైన భోజనం అందించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, విద్యార్థులతో మాట్లాడుతూ... వారి సమస్యలు అడిగి తెలుసుకొని, విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. 

Read More జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

WhatsApp Image 2024-12-04 at 19.46.37

Read More BJYM ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు

విద్యార్థుల సమస్యలపై సంబంధిత అధికారులను ఆదేశించారు. సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసర పరిశుభ్రత పాటించాలన్నారు.తెలంగాణ ప్రజా ప్రభుత్వం గురుకులకు అధిక ప్రాధాన్శిస్తుందని తెలిపారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం తీసుకోవడం కోసం డైట్ ఛార్జీలు, వ్యక్తిగత పరిశుభ్రత కోసం కాస్మెటిక్ ఛార్జీలను 40శాతం మేర ప్రభుత్వం పెంచింది అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, PACS చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, మాజి ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి,పిఏ పల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాప నాయక్,యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొర్ర రాంసింగ్ నాయక్, కిన్నెర హరికృష్ణ, ఘనపురం మాజీ పరమేశ్వర్ యాదవ్, అంగడి పేట మాజీ సర్పంచ్ వంగాల వెంకట్ రెడ్డి, యువ నాయకులు బాబు రామ్ నాయక్, RDO రమణా రెడ్డి, DM&HO, హాస్పిటల్ సూపరిడెంట్ మంగ్త నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read More భారత్ ఖాదీ క్యాలండర్ ఆవిష్కరించిన ఎన్ సీ సంతోష్