Telangana I పార్లమెంట్ ఎన్నికల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి

 వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాంచన సత్యనారాయణ గుప్తా

Telangana I పార్లమెంట్ ఎన్నికల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి

జయభేరి, హైదరాబాద్ :

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలు కనీసము రెండు టికెట్లు కేటాయించాలని వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. సోమవారము వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో చంపాపేట్ లోని లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో " పార్లమెంట్ ఎన్నికలు వైశ్యుల పాత్ర" పై చర్చ గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

kcm2

Read More Auto I షౌకత్ గ్యారేజ్

సందర్భంగా కాచం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు నుండి పార్లమెంటులో వైశ్యులకు ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయపరంగా వైశ్యుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యమకారునికి మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే వైశ్యులందరూ తప్పకుండా బి అర్ ఎస్ పార్టీ వెంట నడిచి అభ్యర్థిని గెలిపించేందుకు శాయశక్తుల కృషి చేస్తామనీ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2014, 18, 23లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని కేటాయించలేదని పార్లమెంట్ ఎన్నికలోనైన కనీసం ఒక సీటైన కేటాయించాలి అని అన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ కూడా ఎన్నికల్లో కనీసం రెండు సీట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More GHMC I శివ శివ.. హర హర...

kcm3

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక సభ్యులు నంగునూరు రమేష్, రామ్ నరేష్, కాచం సాయి, కాచం సుష్మ, కోడుమూరి దయాకర్, బిల్దే శ్రీధర్, బచ్చు శ్రీనివాస్ గార్లపాటి జితేందర్, శేఖర్, ప్రభు గుప్త, ఉప్పల శ్రవణ్, పూర రమేష్, రావికంటి శ్రీనివాస్, అంజయ్య, వివిధ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

Views: 0