తూoకుంటలో బండి పద్మ మొదటి వర్ధంతి కార్యక్రమం 

బండి పద్మ జ్ఞాపకార్థం మున్సిపల్ కార్యాలయంలో ప్లేట్లు అందచేసిన కుటుంబ సభ్యులు

తూoకుంటలో బండి పద్మ మొదటి వర్ధంతి కార్యక్రమం 

జయభేరి, డిసెంబర్ 4:
తూoకుంట గ్రామానికి చెందిన బండి పద్మ గత సంవత్సరం ఆకస్మికంగా మృతి చెందారు. అయితే ఆమె సివిల్ ఇంజనీర్ గా మండలంలోని గ్రామాలకు తన సేవలను అందించారు. కాగా ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త బండి అనీల్ కుమార్ యాదవ్, కుమారుడు బండి మోహిత్ కుమార్ యాదవ్ లు కలిసి బండి పద్మ జ్ఞాపకార్థం తూoకుంట మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి స్టీల్ ప్లేట్లు అందచేశారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి, మాజి ఎంపిపి బొల్లబోయిన చంద్రశేఖర్ యాదవ్, కౌన్సిలర్ రాజ్ పుత్ భరత్ సింగ్ , తూoకుంట రవీందర్ గౌడ్ లు పాల్గొన్నారు.

Read More విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

bandi2

Read More ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...